ఇండియా- ఎ x ఇంగ్లండ్-ఎ .. ముంబైలో తొలి టీ20 మ్యాచ్

ఇండియా- ఎ x ఇంగ్లండ్-ఎ .. ముంబైలో తొలి టీ20 మ్యాచ్

ముంబై :  ఇండియా విమెన్స్–ఎ టీమ్ క్రికెటర్లకు లక్కీ చాన్స్‌‌‌‌‌‌‌‌. సీనియర్ టీమ్‌‌‌‌‌‌‌‌లోకి రావాలని ఆశిస్తున్న అమ్మాయిలు  ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌ విమెన్స్–ఎ టీమ్‌‌‌‌‌‌‌‌తో మూడు టీ20ల సిరీస్‌‌‌‌‌‌‌‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ సిరీస్‌‌‌‌‌‌‌‌లో తొలి మ్యాచ్‌‌‌‌‌‌‌‌ బుధవారం ముంబై వాంఖడే స్టేడియంలో జరగనుంది.  డిసెంబర్ 1, 3న జరిగే రెండో, మూడో టీ20కి కూడా వాంఖడే స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. దీని తర్వాత ఇండియా, ఇంగ్లండ్ సీనియర్ టీమ్స్ మూడు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల టీ20 సిరీస్‌‌‌‌‌‌‌‌ (డిసెంబర్ 6 నుంచి), ఒక టెస్ట్ మ్యాచ్ ఆడనున్నాయి. 

 అనంతరం ఇండియా టూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రానున్న ఆస్ట్రేలియా ఒక టెస్టు, మూడు వన్డేలు, మూడు టీ20ల్లో ఆతిథ్య జట్టుతో పోటీ పడనుంది. ఇండియా సీనియర్ టీమ్‌‌‌‌‌‌‌‌ను ఇంకా ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో  మిన్ను మణి  కెప్టెన్సీలోని ఇండియా–ఎ ప్లేయర్లు ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌పై ఆకట్టుకుంటే సీనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌లో చోటు దక్కించుకునే అవకాశం ఉంది. హైదరాబాదీ జి. త్రిషతో పాటు పలువురు యంగ్‌‌‌‌‌‌‌‌ స్టర్స్‌‌‌‌‌‌‌‌కు ఈ సిరీస్‌‌‌‌‌‌‌‌ కీలకం కానుంది.