
మొహాలీ వేదికగా అఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో అఫ్ఘన్లు మొదట బ్యాటింగ్ చేయనున్నారు. ఈ మ్యాచ్లో పలు కీలక మార్పులతో భారత జట్టు బరిలోకి దిగుతోంది. వ్యక్తిగత కారణాల రీత్యా విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్కు దూరంగా ఉండగా.. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్తో పాటు అవేశ్ ఖాన్, సంజూ శాంసన్, కుల్దీప్ యాదవ్లు తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయారు.
జితేశ్ శర్మ
మ్యాచ్ ముందువరకూ సంజూ శాంసన్ జట్టులో ఉంటాడనుకున్న.. టీమ్ మేనేజ్మెంట్ అతని స్థానంలో జితేశ్ శర్మకు అవకాశమిచ్చింది. రోహిత్ శర్మతో కలిసి శుభ్మన్ గిల్ ఓపెనింగ్ చేయనుండగా.. తిలక్ వర్మ మూడో స్థానంలో ఆడనున్నాడు.
తుది జట్లు:
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మాన్ గిల్, తిలక్ వర్మ, జితేశ్ శర్మ(వికెట్ కీపర్), రింకూ సింగ్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, ముఖేశ్ కుమార్.
అఫ్గనిస్తాన్: రహ్మనుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్ (కెప్టెన్), రహ్మత్ షా, అజ్మతుల్లా ఓమర్జాయ్, మహ్మద్ నబీ, నజీబుల్లా జద్రాన్, కరీమ్ జన్నత్, గుల్బాదిన్ నయీబ్, ఫజల్హక్ ఫరూఖీ, నవీన్ ఉల్ హక్, ముజీబ్ ఉర్ రెహ్మాన్.