IND vs AFG: 22 పరుగులకే 4 వికెట్లు.. కష్టాల్లో టీమిండియా

IND vs AFG: 22 పరుగులకే 4 వికెట్లు.. కష్టాల్లో టీమిండియా

అఫ్ఘనిస్తాన్‌ తో జరుగుతున్న ఆఖరి టీ20లో భారత బ్యాటర్లు తడబడుతున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ మొదలు పెట్టిన రోహిత్ సేన 22 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయింది. యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్(4) స్వల్ప స్కోరుకే వెనుదిరగ్గా.. అతని స్థానంలో క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ(0) ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. ఎదుర్కొన్న తొలి బంతికే ఔటయ్యాడు.

అనంతరం కొద్దిసేపటికే గత రెండు మ్యాచ్‌‌ల్లో అధ్బతంగా ఆడిన శివమ్ దూబే(1) కూడా ఔటై.. భారత జట్టును మరింత కష్టాల్లోకి నెట్టాడు. 6 బంతులు ఎదుర్కొన్న దూబే  ఒమర్జాయ్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇక సంజూ శాంసన్(0) ఎప్పటిలానే తన ఇన్నింగ్స్‌ను త్వరగా ముగించాడు. ఎదుర్కొన్న తొలి బంతికే ఔటై మరో అవకాశం కోసం ఎదురుచూస్తుంటానని చాటి చెప్పాడు. ప్రస్తుతం టీమిండియా స్కోర్.. 6 ఓవర్లు ముగిసేసరికి 30/4. రోహిత్ శర్మ(13 నాటౌట్), రింకూ సింగ్(2 నాటౌట్) క్రీజులో ఉన్నారు.