IND vs AFG: టీమిండియా బ్యాటింగ్.. జట్టులో మూడు మార్పులు

IND vs AFG: టీమిండియా బ్యాటింగ్.. జట్టులో మూడు మార్పులు

ఇప్పటికే 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను  2-0తో గెలుచుకున్న టీమిండి యా ఇప్పుడు క్లీన్ స్వీప్‌పై కన్నేసింది. పొట్టి ప్రపంచ కప్‌కు ముందు ఆడనున్న ఆఖరి టీ20 మ్యాచ్ ఇదే కావడంతో గెలిచి సిరీస్‌ను వైట్ వాష్ చేయాలనే పట్టుదలగా ఉంది. బెంగళూరులోని చిన్నస్వామి వేదికగా జరుగుతున్న ఆఖరి టీ20లో భారత జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.

ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు మూడు మార్పులతో బరిలోకి దిగుతున్నాయి. గత రెండు మ్యాచ్‌ల్లో బెంచ్‌కు పరిమితమైన సంజూ సాంసన్, కుల్దీప్ యాదవ్ తుది జట్టులో స్తానం దక్కించుకోగా.. అర్షదీప్ సింగ్ స్థానంలో అవేష్ ఖాన్ జట్టులోకి వచ్చారు.   

తుది జట్లు

భారత్: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, శివమ్ దూబే, సంజు శాంసన్(వికెట్ కీపర్), రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్, అవేష్ ఖాన్.

అఫ్ఘనిస్తాన్: రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్ (కెప్టెన్), అజ్మతుల్లా ఒమర్జాయ్, మహమ్మద్ నబీ, నజీబుల్లా జద్రాన్, కరీం జనత్, షరాఫుద్దీన్ అష్రఫ్, ఖైస్ అహ్మద్, మొహమ్మద్ సలీమ్ సఫీ, ఫరీద్ అహ్మద్ మాలిక్.