ఆస్ట్రేలియాతో జరుగుతోన్న తొలి టెస్టు మూడో రోజు ఆట కొనసాగుతోంది. భారత బౌలర్లు చెలరేగుతున్నారు. బౌలర్ల దాటికి ఆసిస్ మూడో రోజే ఆట ముగిసేలా కనిపిస్తుంది. ఎందుకంటే రెండో ఇన్నింగ్స్ లో ఆసిస్ ఇప్పటికే 75 పరుగులు చేసి 8 వికెట్లు కోల్పోయింది. ఇంకా రెండు వికెట్లు పడగొడ్తే ఈ టెస్టులో భారత్ దే విజయం. స్పిన్నర్ అశ్విన్ దాటికి ఆసిస్ బ్యాటర్లు పెవిలియన్ బాట పట్టారు. అశ్విన్ 5 వికెట్లు తీసి ఆసిస్ నడ్డి విరిచాడు. రవీంద్ర జడేజా రెండు వికెట్లు, అర్ పటేల్ ఒక వికెట్ తీశాడు. దీంతో ఆసిస్ 30 ఓవర్లు ముగిసే సరికి 8 వికెట్లు కోల్పోయి 87 పరుగులు చేసింది. ఇంకా 136 పరుగుల వెనుకంజలో ఉంది. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 400 పరుగులకు ఆలౌట్ అవ్వగా..ఆసిస్ తొలి ఇన్నింగ్స్ లో 177 పరుగులకు ఆలౌట్ అయ్యింది.
