IND vs AUS : ఉమేష్.. అశ్విన్ ఉఫ్ అని ఊదేశారు

IND vs AUS : ఉమేష్.. అశ్విన్ ఉఫ్ అని ఊదేశారు

ఇండోర్ వేదికపై ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మూడో టెస్టులో రెండవ రోజు టీమిండియాకు శుభారంభం లభించింది. టీమిండియా బౌలర్లు రవీంద్ర జడేజా, ఉమేష్ యాదవ్, అశ్విన్ రాణించడంలో ఆసీస్ ను 197 పరుగులకే కట్టడి చేశారు. మొదటిరోజు దూకుడు ప్రదర్శించిన ఆసీస్ బ్యాటర్లు రెండవ రోజు తోక ముడిచారు. మొదటి రోజు 156/4  పరుగులతో పటిష్టంగా ఉన్న ఆసీస్ ఉమేష్ యాదవ్, అశ్విన్ ల దాటికి చాప చుట్టేసింది. కేవలం 41 పరుగుల్లోనే 6 వికెట్లు కోల్పోయి ఆలౌట్ అయింది. దీంతో ఆసీస్ కు 88 పరుగుల ఆధిక్యం దక్కింది. భారత్ బౌలర్లలో జడేజా 4, ఉమేష్ యాదవ్ 3, అశ్విన్ 3 వికెట్లు పడగొట్టారు. 

రెండోరోజు ఇన్నింగ్స్ మొదలు పెట్టిన ఆస్ట్రేలియాకు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఆచి తూచి ఆడుతున్న హాండ్ కోంబ్ (19,98 బంతుల్లో) అశ్విన్, గ్రీన్ (21,57 బంతుల్లో) ను పెవిలియన్ చేర్చారు. తర్వాత వచ్చిన ఆసీస్ బ్యాటర్లెవరూ భారత బౌలర్ల ముందు నిలవలేకపోయారు. అలెక్స్ క్యారీ (3), స్టార్క్ (1), లియాన్ (5), ముర్ఫీ (0) లను కట్టడి చేయడంతో ఆస్ట్రేలియా 197 పరుగులకు ఆలౌట్ అయింది.