హాఫ్ సెంచరీలతో చెలరేగిన జడేజా, అక్షర్ పటేల్

హాఫ్ సెంచరీలతో చెలరేగిన జడేజా, అక్షర్ పటేల్

భారత్, ఆస్ట్రేలియా మధ్య నాగ్ పూర్ లో జరుగుతోన్న తొలి టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. రెండో రోజు ఆటముగిసే సమయానికి భారత్  114 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 321 పరుగులు చేసింది. 

ఓవర్ నైట్ స్కోర్ 77/1  తో రెండో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా  నిలకడగా ఆడింది. కెప్టెన్   రోహిత్ శర్మ 120 పరుగులు చేసి టీమిండియా ఆధిక్యంలో కీలక పాత్ర పోషించాడు.  రవీంద్ర జడేజా 66( నాటౌట్), అక్షర్ పటేల్ 52 (నాటౌట్) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. దీంతో భారత్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 144 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది.  ప్రస్తుతం క్రీజులో జడేజా 66, అక్షర్ పటేల్ 52 పరుగులతో ఉన్నారు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 177 పరుగులకే ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే..