
ఆస్ట్రేలియాతో జరుగుతోన్న టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్ లో 400 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఓవర్ నైట్ స్కోర్ 321/7పరుగులతో మూడో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా మరో 79 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. అక్షర్ పటేల్ 84 పరుగులకు తోడుగా షమీ 37 పరుగులు చేసి ఔటయ్యాడు. దీంతో మొదటి ఇన్నింగ్స్ లో భారత్ 223 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. బ్యాటింగ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీ(120) , రవీంద్ర జడేజా 70 పరుగులతో చెలరేగిన సంగతి తెలిసిందే. ఆసీస్ బౌలర్లలో యువ స్పిన్నర్ మర్ఫీ 7 వికెట్లు , పాట్ కమిన్స్ 2, లైయన్ ఒక వికెట్ తీసుకున్నారు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్లో ఆసీస్ 177 పరుగులకే కుప్పకూలింది.
ఇక రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసిస్ 7 పరుగుల వద్ద ఉస్మాన్ ఖవాజా(5) తొలి వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం 5 ఓవర్లు ముగిసే సరికి ఒక వికెట్ నష్టానికి 18పరుగులు చేసింది. క్రీజులో డేవిడ్ వార్నర్ 1, లబుషేంజ్ 10 పరుగులతో ఉన్నారు.