IND vs AUS : రెండో వన్డేకు వాన ముప్పు?

IND vs AUS : రెండో వన్డేకు వాన ముప్పు?

ఆస్ట్రేలియాతో మార్చి 19న  జరగనున్న రెండో మ్యాచ్ కి టీమిండియా, ఆస్ట్రేలియా వైజాగ్ చేరుకుంది. ఇప్పటికే తొలి వన్డేలో గెలిచి సీరీస్ 1-0 ఆధిక్యంలో ఉన్న భారత్ ఎలాగైనా సిరీస్ ను కైవసం చేసుకోవాలని చూస్తోంది. ఫస్ట్ వన్డేకు దూరమైన కెప్టెన్ రోహిత్ శర్మ కూడా  రెండో వన్డే ఆడనున్నాడు.  అటు  మ్యాచ్ కోసం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు.

అయితే మ్యాచ్ జరుగుతుందా లేదా అనే ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో వడగండ్ల వానలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ మ్యాచ్ కు వాన ముప్పు ఉన్నట్టు వాతావరణ శాఖ కూడా తెలిపింది. ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.  ఈ క్రమంలోనే మ్యాచ్ జరుగుతుందా? లేదా? అని క్రికెట్ లవ్వర్స్  టెన్షన్ పడుతున్నారు.