
ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరుగుతోన్న తొలి టెస్టు మ్యాచ్ లో అరంగేట్రం చేసిన తెలుగు కుర్రాడు కేఎస్ భరత్ నిరాశ పరిచాడు. కెప్టెన్ రోహిత్ శర్మ 120 పరుగులకు ఔటవ్వగానే బ్యాటింగ్ కు వచ్చిన భరత్ 10 బంతులు ఆడి 8 పరుగులే చేశాడు. ఆస్ట్రేలియా స్పిన్నర్ టాడ్ మర్ఫీ బౌలింగ్ లో భరత్ ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. దీంతో తెలుగు అభిమానులు నిరాశకు గురయ్యారు.
ప్రస్తుతం టీమిండియా 113 ఓవర్లు ముగిసే సరికి 7 వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది. 144 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. క్రీజులో రవీంద్ర జడేజా 66, అక్షర్ పటేల్ 52 పరుగులతో నాటౌట్ ఉన్నారు. ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్ లో 177 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఫస్ట్ ఇన్నింగ్స్ లో బౌలింగ్ లో జడేజా తిప్పేశాడు. 5 వికెట్లు తీసి ఆస్ట్రేలియాను కట్టడి చేశాడు.