
రాయ్ పూర్ వేదికపై రెండో వన్డేలో న్యూజిలాండ్ జట్టుని చిత్తుగా ఓడించిన టీమిండియా సిరీస్ కైవసం చేసుకుంది. రేపు (జనవరి 24) ఇండోర్ లో జరగబోయే మూడో వన్డేలో కూడా గెలిచి సిరీస్ ను క్లీస్ స్వీప్ చేయాలని భావిస్తోంది. అయితే, రేపు ఆతిథ్యం ఇవ్వబోయే హోల్కర్ క్రికెట్ స్టేడియం పూర్తిగా బ్యాటింగ్ కు అనుకూలిస్తుండగా, రెండు ఇన్నింగ్స్ ల్లో భారీ స్కోర్ నమోదయ్యే అవకాశం ఉంది. సగటున తొలి ఇన్నింగ్స్ లో 308 పరుగుల స్కోర్ నమోదయ్యే ఛాన్సుంది. స్టేడియంలో మునుపటి ఓడీఐ రికార్డులు పరిశీలిస్తే..
హోల్కర్ స్టేడియంలో టీమిండియా ఒక్కసారి కూడా ఓడిపోయింది లేదు. ఇప్పటి వరకు ఈ స్టేడియంలో 5 వన్డే మ్యాచ్ లు జరగగా.. 3సార్లు మొదట బ్యాటింగ్ చేసిన జట్టు, 2సార్లు సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్టు గెలిచింది. అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డు వీరేంద్ర సెహ్వాగ్ (219 పరుగులు, వెస్టిండీస్ పై 2011లో)పై ఉంది. బౌలింగ్ విషయానికొస్తే ఎస్. శ్రీకాంత్ (6/55, ఇంగ్లాండ్ పై 2006లో) పై ఉంది. అత్యధిక స్కోరు రికార్డు భారత్ 418 కాగా, అత్యల్ప జట్టు స్కోరు దక్షిణాఫ్రికా 225 పేరిట ఉన్నాయి. అయితే, ఇప్పటికే సిరీస్ గెలిచిన టీమిండియా ఈ మ్యాచ్ లో కొత్త ప్లేయర్లకు ఛాన్సిచ్చే అవకాశం ఉంది.