INDvsNZ: తొలి టీ20లో భారత్ ఓటమి

INDvsNZ: తొలి టీ20లో భారత్ ఓటమి

న్యూజిలాండ్ తో జరిగిన తొలి టీ20 లో భారత్ ఓటమి పాలైంది. 177 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన టీమిండియా 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 155 పరుగులే చేసింది. న్యూజిలాండ్ 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్ లో  న్యూజిలాండ్ 1,-0 తో ముందంజలో ఉంది. వాషింగ్టన్ సుందర్ ఒక్కడే 28 బంతుల్లో హాఫ్ సెంచరీతో చెలరేగినా ఫలితం లేకుండా పోయింది.

సూర్యకుమార్ యాదవ్ 47, వాషింగ్టన్ సుందర్  50 పరుగులు మినహా భారత బ్యాటర్లు మిగతా వారెవరూ పెద్దగా రాణించలేదు. ఓపెనర్లు శుభ్ మన్ గిల్7, ఇషాన్ కిషన్ 4, రాహుల్ త్రిపాఠి డకౌట్, హార్దిక్ పాండ్యా 21, దీపక్ హుడా 10 పరుగులు చేశారు.  న్యూజిలాండ్ బౌలర్లలో మిచెల్ సాంట్నర్ 2, మైఖేల్ బ్రేస్‌వెల్2, జోకబ్ డఫ్పీ, ఫెర్గుసన్, ఇష్ సోది తలో ఒక వికెట్ తీశారు. అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 176 పరుగులు చేసింది.