IND vs PAK: అది స్టేడియం ఏంట్రా బాబోయ్.. చుట్టూ చెట్లు, పుట్టలు

IND vs PAK: అది స్టేడియం ఏంట్రా బాబోయ్.. చుట్టూ చెట్లు, పుట్టలు

ఐసీసీ టోర్నీ అంటే చాలు భారత్, పాకిస్థాన్ మ్యాచ్ చూడడానికి ఫ్యాన్స్ తెగ ఆసక్తి చూపిస్తారు. ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరగక దాదాపుగా 12 సంవత్సరాలు కావొస్తుంది. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ ఐసీసీ టోర్నీలో దాయాదుల సమరాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.  దానికి తగ్గట్టుగానే ఐసీసీ టోర్నీల్లో 2013 నుంచి భారత్, పాకిస్థాన్ జట్లను ఒకే గ్రూప్ లో ఉండేలా ఐసీసీ షెడ్యూల్ సిద్ధం చేస్తుంది. తాజాగా 2024 టీ 20 వరల్డ్ కప్ కు సైతం భారత్, పాక్ జట్లు ఒకే గ్రూప్ లో ఉండడంతో అభిమానులు పండగ చేసుకున్నారు. జూన్ 9 న భారత్, పాక్ న్యూయార్క్ సిటీలో తలపడడం ఖాయమైంది. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. 

న్యూయార్క్ స్టేడియం ఇంకా నిర్మించలేదని తెలుస్తుంది. చూడడానికి చుట్టూ చెట్లు పుట్టలతో దారుణంగా ఉంది. గ్రౌండ్ చూడడానికి గల్లీ స్టేడియంలా కూడా లేకపోవడం ఇప్పుడు ఫ్యాన్స్ ను కలవరపెడుతుంది. 2024 టీ20 ప్రపంచకప్ సందర్భంగా అంతర్జాతీయ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్న న్యూయార్క్‌లోని క్రికెట్ స్టేడియం ఇంకా నిర్మించలేదని అమెరికన్ క్రికెట్ జర్నలిస్ట్ పీటర్ డెల్లా పెన్నా పేర్కొన్నారు.

అతను సరైన పిచ్ కూడా లేని మైదానం యొక్క చిత్రాలు మరియు వీడియోను కూడా పోస్ట్ చేశాడు. వీడియో ప్రకారం పిచ్ యొక్క ప్రస్తుత స్థితి అంతర్జాతీయ ప్రమాణాలకు సమీపంలో ఎక్కడా లేదు. జూన్ 9న భారత్-పాకిస్థాన్ మధ్య జరిగే స్టేడియం ఇదని తెలిసి ఇప్పుడు అందరూ షాక్ అవుతున్నారు. ఈ స్టేడియం ఎప్పటికి నిర్మితమవుతుందో ఇప్పటికీ ఒక క్లారిటీ రావడం లేదు. మరో 5 నెలల సమయం మాత్రమే మిగిలి ఉండడంతో ఈ స్టేడియం నిర్మాణం ఎప్పుడు మొదలు పెడతారో చూడాలి. 

జూన్ 1 నుంచి జరగనున్న ఈ మెగా టోర్నీ జూన్ 29 న ముగుస్తుంది. వెస్టింసీడ్, అమెరికా సంయుక్తంగా ఈ మెగా టోర్నీకి ఆతిధ్యమిస్తున్నాయి. జూన్ 1న టోర్నమెంట్ తొలి మ్యాచ్ లో ఆతిధ్య అమెరికా.. కెనడాతో తలపడుతుంది. జూన్ 29న బార్బడోస్ ఫైనల్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. గ్రూప్ 'ఏ' లో పాకిస్తాన్, కెనడా, ఐర్లాండ్, అమెరికా, భారత్ లు ఉన్నాయి.