దక్షిణాఫ్రికాను 55 పరుగులకే కట్టడి చేశామన్న ఆనందం భారత ఆటగాళ్లకు కనీసం నాలుగు గంటలైనా నిలవలేదు. వారి అడుగుజాడల్లోనే మనవాళ్ళు పయనించారు. బాగా ఆడారు.. అని మెచ్చుకునేలోపే అదంతా తప్పని నిరూపించారు. పోటీ పడుతూ ఒకరి వెంట మరొకరు పెవిలియన్ చేరి 153 పరుగులకే కుప్పకూలారు. భారత తొలి ఇన్నింగ్స్ చివరి 11 బంతుల్లో ఒక్క పరుగు చేయకుండానే ఏకంగా 6 వికెట్లు కోల్పోవడం గమనార్హం.
India's score
— Kausthub Gudipati (@kaustats) January 3, 2024
153/4
153/5
153/6
153/7
153/8
153/9
153/10
FIRST TIME ever a team lost 6 consecutive wickets at the same score in all international cricket.#SAvIND
సఫారీ పర్యటనలో ఒక ఇన్నింగ్స్ లో భారత ఆటగాళ్లు ఆరుగురు డకౌట్ అవ్వడం ఇదే తొలిసారి. ఒక్క పరుగు చేయని భారత ప్లేయర్లలో యశస్వి జైస్వాల్, శ్రేయాస్ అయ్యర్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ క్రిష్ణ ఉన్నారు. దక్షిణాఫ్రకా బౌలర్లలో కసిగో రబాడ, లుంగి ఎంగిడీ, నండ్రే బర్గర్ లు తలా 3 వికెట్లు తీసుకున్నారు.
దక్షిణాఫ్రికా 55 అలౌట్
అంతకుముందు మహ్మద్ సిరాజ్ 6 వికెట్లతో చెలరేగడంతో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ లో 55 పరుగులకే కుప్పకూలింది.