అసెంబ్లీ, మండలిలో ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు

అసెంబ్లీ, మండలిలో ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు

హైదరాబాద్: దేశవ్యాప్తంగా పంద్రాగస్టు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా అసెంబ్లీలో జాతీయ జెండాను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆవిష్కరించారు. అలాగే శాసన మండలిలో త్రివర్ణ పతాకాన్ని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఎగుర వేశారు. 
అంతకుముందు అసెంబ్లీ ఆవరణలో మహాత్మాగాంధీతో పాటు అంబేడ్కర్ విగ్రహానికి నేతలు నివాళులర్పించారు. స్వాతంత్ర వేడుకల్లో భాగంగా పోలీసులు గౌరవ వందనం స్వీకరించారు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. దేశ ప్రజలందరికీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.