మూడో వన్డేలో బంగ్లాకు 410 పరుగుల టార్గెట్

మూడో వన్డేలో బంగ్లాకు 410 పరుగుల టార్గెట్

బంగ్లాతో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ చెలరేగింది. బంగ్లా బౌలర్లను భారత బ్యాట్స్ మెన్  ఊచకోత కోశారు. బంగ్లాదేశ్ కు 410 పరుగుల భారీ టార్గెట్ ను నిర్దేశించింది. ఇషాన్ కిషన్ 210, విరాట్ కోహ్లీ 113 పరుగులతో రెచ్చిపోయారు. ఇషాన్ కిషన్ 131 బంతుల్లోనే 210(24 ఫోర్లు,10 సిక్సులు), విరాట్ కోహ్లీ 91 బంతుల్లో 113 పరుగులు చేశారు. తర్వాత వచ్చిన వాషింగ్టన్  సుందర్ 37, అక్షర్ పటేల్ 20 పరుగులతో రాణించడంతో భారత్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 409 పరుగుల భారీ స్కోర్ చేసింది.

బంగ్లా బౌలర్లలో  తాసిక్ అహ్మద్ 2, హోసెన్ 2, షకీబ్ అల్ హాసన్ 2, హసన్ మిరాజ్, ముస్తఫిజర్ రహ్మన్ లకు చెరో వికెట్ పడ్డాయి. బంగ్లాపై భారత్ కు ఇదే అత్యధిక స్కోర్. ఓవరాల్ గా వన్డేలో భారత్ 400 కు పైగా స్కోర్ చేయడం ఇది ఆరోసారి.