బంగ్లాదేశ్ తో జరుగుతోన్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 314 పరుగులుకు ఆలౌట్ అయింది. దీంతో 87 రన్స్ లీడ్ సాధించింది. రిషభ్ పంత్ (93), శ్రేయస్ అయ్యర్ (87) అర్ధశతకాలు సాధించారు. కేఎల్ రాహుల్ 10, శుబ్మన్ గిల్ 20, ఛెతేశ్వర్ పుజారా 24, విరాట్ కోహ్లీ 24, అక్షర్ పటేల్ 4, రవిచంద్రన్ అశ్విన్ 12, ఉమేశ్ యాదవ్ 14 పరుగులు చేశారు.
బంగ్లా బౌలర్లలో తైజుల్ ఇస్లామ్ 4, షకిబ్ 4.. తస్కిన్, మెహిదీ చెరో వికెట్ తీశారు. కాగా బంగ్లా తొలి ఇన్నింగ్స్ లో 227పరుగులకు ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. రెండో ఇన్సి్ంగ్స్ స్టార్ట్ చేసిన బంగ్లాదేశ్ 5 పరుగులు చేసింది. జాకీర్ హుస్సేన్(4), నజ్ముల్ శాంటో(1) క్రీజ్ లో ఉన్నారు. కాగా ఇప్పటికే ఈ సిరీస్ లో టీమిండియా అధిక్యంలో ఉంది.