భూటాన్‌కు అండగా భారత్‌: మోడీ

భూటాన్‌కు అండగా భారత్‌: మోడీ

భారత ప్రధాని నరేంద్రమోడీ రెండు రోజుల భూటాన్ పర్యటన ముగిసింది. భూటాన్ లో తన పర్యటన సందర్భంగా 10 MOUలను కుదుర్చకున్నారు. హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్, రూపే కార్డులను మోడీ ప్రారంభించారు. అదేవిధంగా దక్షిణాసియా ఉపగ్రహానికి గ్రౌండ్ స్టేషన్ ను మోడీ ప్రారంభించారు. ఇందులో భాగంగా రాయల్ యూనివర్సిటీ ఆఫ్ భూటాన్ లో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. భూటాన్ కు భారత్ అండగా ఉంటుందని…ఆ దేశ ప్రజలకు హామీ ఇచ్చారు మోడీ. భూటాన్ పర్యటనలో భాగంగా ఆ దేశ రాజదంపతులు మోడీకి విందు ఇచ్చారు. తన పర్యటన తర్వాత ప్రత్యేక విమానంలో భారత్ కు బయల్దేరారు ప్రధాని మోడీ.