
న్యూఢిల్లీ: యంగ్ క్రికెటర్, తెలుగమ్మాయి అంజలి శర్వాణి విమెన్స్ టీ20 వరల్డ్కప్నకు ఎంపికైంది. సౌతాఫ్రికా వేదికగా ఫిబ్రవరి 10–26 మధ్య జరిగే ఈ మెగా టోర్నీలో పాల్గొనే ఇండియా టీమ్ను ఆలిండియా విమెన్స్ సెలెక్షన్ కమిటీ బుధవారం ప్రకటించింది. 15 మందితో కూడిన టీమ్లో ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన 25 ఏండ్ల అంజలికి చోటు దక్కింది. ఇటీవల ఆస్ట్రేలియాతో సిరీస్తో డెబ్యూ చేసిన ఎడమచేతి వాటం పేసర్ అంజలి ఆకట్టుకుంది. వెటరన్ పేసర్ శిఖా పాండేకు సెలక్టర్లు రీఎంట్రీ చాన్స్ ఇచ్చారు. 2021 అక్టోబర్లో వివాదాస్పద రీతిలో టీమ్ నుంచి తప్పించిన తర్వాత ఆమెను తిరిగి తీసుకున్నారు. హర్మన్ప్రీత్ కౌర్ కెప్టెన్గా వ్యవహరించనుండగా.. స్మృతి మంధాన వైస్ కెప్టెన్గా ఉంటుంది. ఆసీస్తో సిరీస్లో పెద్దగా రాణించకపోయినా జెమీమా టీమ్లో చోటు నిలబెట్టుకుంది. పేసర్ల కోటాలో రేణుకా ఠాకూర్, పూజా వస్త్రాకర్ ఎంపికయ్యారు. కానీ, వస్త్రాకర్ ఫిట్నెస్ నిరూపించుకోవాల్సి ఉంటుందని బోర్డు ప్రకటించింది. స్పిన్ కేటగిరీలో ఆల్రౌండర్లు దీప్తి శర్మ, దేవికా వైద్యాతో పాటు రాధా యాదవ్, రాజేశ్వరి ఎంపికయ్యారు. వరల్డ్కప్లో రిజర్వ్ ప్లేయర్లుగా తెలుగమ్మాయి సబ్బినేని మేఘన, స్నేహ్ రాణా, మేఘనా సింగ్కు సెలెక్టర్లు అవకాశం ఇచ్చారు. వరల్డ్కప్లో గ్రూప్2లో ఉన్న ఇండియా ఫిబ్రవరి 12న తన తొలి మ్యాచ్ను కేప్టౌన్లో పాకిస్తాన్తో ఆడుతుంది. 15, 18, 20వ తేదీల్లో వరుసగా వెస్టిండీస్, ఇంగ్లండ్, ఐర్లాండ్తో తలపడుతుంది.
వరల్డ్కప్ ముందు ట్రై సిరీస్
టీ20 వరల్డ్కప్నకు ప్రిపరేషన్గా ఇండియా టీమ్.. సఫారీ గడ్డపై ట్రై సిరీస్ ఆడనుంది. సౌతాఫ్రికా, వెస్టిండీస్ కూడా తలపడే ఈ టీ20 సిరీస్ జనవరి 19న మొదలవుతుంది. ఈ సిరీస్ కోసం కూడా సెలెక్టర్లు టీమ్ను ప్రకటించారు. వరల్డ్ కప్లో ఉన్న వాళ్లతో పాటు 2021 నుంచి టీమ్కు దూరంగా ఉన్న కీపర్ సుష్మా వర్మ, అన్క్యాప్డ్ ఆల్రౌండర్ అజన్జోత్ కు అవకాశం దక్కింది.
టీ20 వరల్డ్ కప్ టీమ్: హర్మన్ప్రీత్ (కెప్టెన్), మంధాన (వైస్–కెప్టెన్), షెఫాలీ, యస్తికా (కీపర్), రిచా ఘోష్ (కీపర్) జెమీమా, హర్లీన్, దీప్తి, రాధా యాదవ్, రేణుకా ఠాకూర్, అంజలి, వస్త్రాకర్, రాజేశ్వరి, శిఖా; రిజర్వ్లు: సబ్బినేని మేఘన, స్నేహ రాణా, మేఘనా సింగ్.