
- తెలంగాణ బాక్సర్ హుస్సాముద్దీన్కు అర్జున
- క్రికెటర్ మహ్మద్ షమీ,ఇషా సింగ్కు కూడా..
న్యూఢిల్లీ: ఇండియా బ్యాడ్మింటన్ డబుల్స్ స్టార్లు సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి జోడీకి.. ప్రతిష్టాత్మక ధ్యాన్చంద్ ఖేల్రత్న అవార్డు లభించింది. తెలంగాణ బాక్సర్ మొహమ్మద్ హుస్సాముద్దీన్, షూటర్ ఇషా సింగ్, క్రికెటర్ మహ్మద్ షమీ అర్జున అవార్డులకు ఎంపికయ్యారు. ఈ మేరకు కేంద్ర యువజన, క్రీడల మంత్రిత్వ శాఖ.. జాతీయ క్రీడా అవార్డులను బుధవారం ప్రకటించింది.
వన్డే వరల్డ్ కప్లో ఆడిన ఏడు మ్యాచ్ల్లో 24 వికెట్లు పడగొట్టిన షమీని బీసీసీఐ ప్రత్యేకంగా పురస్కారం కోసం సిఫారసు చేసింది. ఈసారి మొత్తం 26 మందికి అర్జున అవార్డులను ఇవ్వనున్నారు. ఓజాస్ ప్రవీణ్ డియోటలే (ఆర్చరీ), అదితి గోపీచంద్ స్వామి (ఆర్చరీ), మురళీ శ్రీశంకర్ (అథ్లెటిక్స్), పారుల్ చౌదరీ (అథ్లెటిక్స్, ఆర్. వైశాలి (చెస్), అన్షూ అగర్వాల (ఈక్వెస్ట్రియాన్), దివ్యాకృతి సింగ్ (ఈక్వెస్ట్రియాన్ డ్రెసెజ్), దీక్షా డాగర్ (గోల్ఫ్), కృష్ణ బహుదూర్ పాథక్ (హాకీ), సుశీలా చానూ (హాకీ), పవన్ కుమార్ (కబడ్డీ), రీతూ నేగీ (కబడ్డీ), నస్రీన్ (ఖోఖో), పింకి (లాన్ బాల్స్), ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తొమర్ (షూటింగ్), హరీందర్ పాల్ సింగ్ సంధు (స్క్వాష్), ఐహికా ముఖర్జీ (టేబుల్ టెన్నిస్), సునీల్ కుమార్ (రెజ్లింగ్), అంటిమ్ (రెజ్లింగ్), రోషిబినా దేవి (వుషు), శీతల్ దేవి (పారా ఆర్చరీ), ఇల్లూరీ అజయ్ కుమార్ రెడ్డి (బ్లైండ్ క్రికెట్), ప్రాచీ యాదవ్ (పారా కనోయింగ్) ఇందులో ఉన్నారు. వచ్చే ఏడాది జనవరి 9న రాష్ట్రపతి భవన్లో జరిగే కార్యక్రమంలో ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము ఈ అవార్డులను విజేతలకు అందజేయనున్నారు.
ద్రోణాచార్య అవార్డు: లలిత్ కుమార్ (రెజ్లింగ్), ఆర్బీ రమేశ్ (చెస్), మహావీర్ ప్రసాద్ సైనీ (పారా అథ్లెటిక్స్), శివేంద్ర సింగ్ (హాకీ), గణేశ్ ప్రభాకర్ దేవురుకర్ (మల్లకాంబ్).
ద్రోణాచార్య అవార్డు (లైఫ్ టైమ్): జస్కీరత్ సింగ్ గ్రేవాల్ (గోల్ఫ్), భాస్కరన్ ఈ (కబడ్డీ), జయంత కుమార్ పుషిలాల్ (టేబుల్ టెన్నిస్).
ధ్యాన్చంద్ అవార్డు (లైఫ్ టైమ్): మంజుషా కన్వర్ (బ్యాడ్మింటన్), వినీత్ కుమార్ శర్మ (హాకీ), కవితా సెల్వరాజ్ (కబడ్డీ).
మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ ట్రోఫీ: గురు నానక్ దేవ్ యూనివర్సిటీ (అమృత్సర్), లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (పంజాబ్ ఫస్ట్ రన్నరప్), కురుక్షేత్ర యూనివర్సిటీ (కురుక్షేత్ర సెకండ్ రన్నరప్).