
వుంగ్ తౌ (వియత్నాం): అండర్–23 ఆసియా రెజ్లింగ్ చాంపియన్షిప్లో ఇండియా మెన్స్కు టీమ్ టైటిల్ లభించింది. బరిలోకి దిగిన ఏడు విభాగాల్లో ఆరు స్వర్ణాలు, ఒక రజతం సాధించారు. ఆదివారం జరిగిన పోటీల్లో నిఖిల్ (61 కేజీ), సుజీత్ కల్కాల్ (65 కేజీ), జైదీప్ (74 కేజీ), చందర్ మోహన్ (79 కేజీ), సచిన్ (92 కేజీ), వికీ (97 కేజీ) గోల్డ్ మెడల్స్తో మెరవగా, జస్పూరన్ సింగ్ (125 కేజీ) సిల్వర్ను సొంతం చేసుకున్నాడు. గ్రీకో రోమన్ టీమ్ ఒక గోల్డ్తో కలిపి మూడు మెడల్స్ను సాధించింది.