
వాషింగ్టన్: ఇటీవల జీ20 సమిట్ సందర్భంగా ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరప్ ఎకనామిక్ కారిడార్ ఏర్పాటుకు ప్రకటన చేయడమే.. ఇజ్రాయెల్పై హమాస్ దాడికి కారణమై ఉండొచ్చని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అనుమానం వ్యక్తం చేశారు. ఈ కారిడార్ తో రైల్వే, రోడ్, పోర్ట్స్ కనెక్టివిటీ జరుగుతుందన్నారు. ఇజ్రాయెల్పై హమాస్ టెర్రరిస్ట్లు జరిపిన దాడులకు ఈ ఎంవోయూ కూడా ఒక కారణమని నమ్ముతున్నట్లు బైడెన్ వివరించారు.
అయితే.. దీనికి సంబంధించిన ప్రూఫ్స్ మాత్రం తన వద్ద లేవన్నారు. ఇది ఇజ్రాయెల్తో పాటు ప్రాంతీయ సమైక్యత కోసం చేపట్టిన కారిడార్ అని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇండియా–మిడిల్ ఈస్ట్–యూరప్ కారిడార్ విషయంలో వెనక్కి తగ్గబోమని బైడెన్ స్పష్టం చేశారు.