న్యూఢిల్లీ: ఇంటర్నేషనల్ కమర్షియల్ ప్యాసెంజర్ ఫ్లయిట్స్పై బ్యాన్ను కేంద్రం పొడిగించింది. వచ్చే నెల 31 వరకు ఫ్లయిట్స్పై నిషేధం కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిబంధనలు ఏవియేషన్ రెగ్యులేటర్, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అప్రూవ్ చేసిన ఇంటర్నేషనల్ కార్గో ఆపరేషన్స్కు వర్తించబోవని స్పష్టం చేసింది.
ఇండియాకు వచ్చే, వెళ్లే షెడ్యూల్ ఇంటర్నేషనల్ కమర్షియల్ ప్యాసెంజర్ సర్వీసెస్పై ఆగస్టు 31 వరకు సస్పెన్షన్ను పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించాం అని ఓ ప్రకటనలో కేంద్ర సర్కార్ తెలిపింది. ఈ నెలారంభంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ఇంటర్నేషనల్ ఫ్లయిట్స్పై జూలై 31 వరకు కేంద్రం నిషేధం విధించింది. ప్రస్తుతం పరిస్థితిలో పెద్దగా మార్పు లేవడంతో ఆ బ్యాన్ను మరో నెల రోజులు కొనసాగిస్తున్నట్లు పేర్కొంది.