WT20 worldcup: ఆస్ట్రేలియాతో టీమిండియా సెమీస్ పోరు

WT20 worldcup: ఆస్ట్రేలియాతో టీమిండియా సెమీస్ పోరు

మహిళల టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్ లో టీమిండియా.. ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ నెల 23న ఇరుజట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. గ్రూప్ బీలో ఇంగ్లండ్.. పాకిస్థాన్ ను 114 పరుగుల తేడాతో చిత్తు చేసి టాప్ లో నిలిచింది. దాంతో 6 పాయింట్లతో ఉన్న భారత్ కు రెండో ప్లేస్ దక్కింది. గ్రూప్-ఏలో 4 మ్యాచ్లు గెలిచి 8 పాయింట్లతో ఆసీస్ టాప్ లో నిలిచింది. సౌతాఫ్రికా, బంగ్లాదేశ్ ల మధ్య జరిగే మ్యాచ్ లో సౌతాఫ్రికా గెలిస్తే ఇంగ్లండ్ తో రెండో సెమీస్ ఆడుతుంది. లేదంటే న్యూజిలాండ్ సెమీస్ ఆ అవకాశం దక్కుతుంది. 

పోయిన ఏడాది ఫైనల్ లో ఆసీస్ తో తలపడ్డ భారత్ ఓటమి పాలయింది. గత టీ20 సిరీస్ లో కూడా అంతగా రాణించలేదు. ఈ క్రమంలో 5 సార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన ఆసీస్ ను భారత్ ఓడించాలంటే కష్టపడాల్సిందే. లేదంటే ప్రపంచకప్ ని ముద్దాడాలన్న టీమిండియా ఆశపై నీళ్లు చల్లుకోవాల్సిందే.