IND vs NZ : 219 రన్స్ కి టీమిండియా ఆలౌట్

IND vs NZ : 219 రన్స్ కి టీమిండియా ఆలౌట్

న్యూజిలాండ్, భారత్  జట్ల మధ్య జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్ లో భారత్ 47.3 ఓవర్లలో 219 పరుగులు చేసి ఆలౌట్ అయింది. సిరీస్ ఫలితాన్ని నిర్ణయించే ఈ మ్యాచ్ లో భారత కుర్రాళ్లు బ్యాటింగ్ లో న్యూజిలాండ్ కి గట్టిపోటీ ఇవ్వలేకపోయారు. మిడిల్ ఆర్డర్ లో శ్రేయస్ అయ్యర్ (49), లోవర్ ఆర్డర్ లో ఆల్ రౌండర్ వాషింగ్ టన్ సుందర్ (51) మినహా ఏ బ్యాటర్  కూడా న్యూజిలాండ్ బౌలర్లకు ఎదురు నిల్వలేకపోయారు. 

దూకుడుగా ఆడి స్కోర్ బోర్డ్ ని పరుగులు పెట్టించాలనుకున్న ఓపెనింగ్ జోడీ శిఖర్ ధవన్ (28), శుభ్ మన్ గిల్ (13) 17 ఓవర్లు ముగిసేసరికి పెవిలియన్ చేరారు. అ తర్వాత వచ్చిన బ్యాట్స్ మెన్ అయ్యర్ కు తోడుగా నిలిచి మంచి భాగస్వామ్యం నెలకొల్పుతారనుకున్న పంత్ (10), సూర్య కుమార్ యాదవ్ (6) మరొకసారి నిరాశపరిచారు. మిగతా బ్యాట్స్ మన్ దీపక్ చాహర్ (12), దీపక్ హుడా (12) కూడా బ్యాట్ తో రాణించలేకపోయారు. న్యూజిలాండ్ బౌలర్ డారిల్ మిచెల్ 7 ఓవర్లలో కేవలం 25 పరుగులిచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. తనకు తోడుగా టిమ్ సౌథీ 8.3 ఓవర్లలో 36 రన్స్ ఇచ్చి 2 వికెట్లు, ఆడమ్ మిల్నే 3 వికెట్లు పడగొట్టారు. లాకీ ఫెర్గూసన్, మిచెల్‌ సాంట్నర్ చెరో వికెట్‌ తీశారు. కాగా ఇప్పటికే ఈ సిరీస్ లో కివీస్ 1 0 తో ముందంజలో ఉంది.