
ప్రపంచాన్ని వణికిస్తున్నకరోనా వైరస్ ను నిర్మూలించే సామర్థ్యం భారత్ కు ఉందని డబ్ల్యూహెచ్ వో తెలిపింది. గతంలో స్మాల్ పాక్స్ ,పోలియో వంటి మహమ్మారి వ్యాధులను నిర్మూలించి ప్రపంచానికి భారత్ ఆదర్శంగా నిలిచిందని డబ్ల్యూహెచ్ఓ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మైఖేల్ జె ర్యాన్ అన్నారు. వైరస్ ను ఎదుర్కొనేందుకు భారత్ వద్ద అపారమైన సామర్థం ఉందని..ఇపుడు కూడా ఈపరిస్థితి నుంచి గట్టెక్కించేందుకు భారత్ సిద్ధం కావాలన్నారు. వైరస్ ను నిర్మూలించే దిశగా అడుగులు వేసి ప్రపంచ దేశాలకు భారత్ మార్గం చూపాలన్నారు.