ఆసియా మిక్స్‌‌డ్‌‌ టీమ్‌‌ చాంపియన్‌‌షిప్‌‌ సెమీస్‌‌లో ఇండియా

ఆసియా మిక్స్‌‌డ్‌‌ టీమ్‌‌ చాంపియన్‌‌షిప్‌‌ సెమీస్‌‌లో ఇండియా

దుబాయ్‌‌: ఆసియా మిక్స్‌‌డ్‌‌ టీమ్‌‌ చాంపియన్‌‌షిప్‌‌లో ఇండియా సెమీస్‌‌లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన క్వార్టర్‌‌ఫైనల్లో ఇండియా 3–2తో హాంకాంగ్‌‌ చైనాపై గెలిచింది. దీంతో కనీసం బ్రాంజ్‌‌ మెడల్‌‌ను ఖాయం చేసుకుంది. మిక్స్‌‌డ్‌‌ డబుల్స్‌‌లో ఇషాన్‌‌ భట్నాగర్‌‌–తానిషా క్రాస్టో 24–26, 17–21తో లీ చున్‌‌–ఎన్జ్‌‌ యు చేతిలో ఓడారు. తర్వాత జరిగిన మెన్స్‌‌ సింగిల్స్‌‌లో లక్ష్యసేన్‌‌ 22–20, 19–21, 18–21తో లాంగ్‌‌ అంగుస్‌‌ చేతిలో కంగుతిన్నాడు. దీంతో ఇండియా 0–2తో వెనుకబడింది. ఇక కీలకమైన మెన్స్‌‌ డబుల్స్‌‌లో ధ్రువ్‌‌ కపిల–చిరాగ్‌‌ షెట్టి 20–22, 21–16, 21–11తో టాంగ్‌‌ చున్‌‌ మన్‌‌–యంగ్‌‌ షిన్‌‌ చోయ్‌‌పై నెగ్గి ఆధిక్యాన్ని 1–2కు తగ్గించారు. ఈ దశలో విమెన్స్‌‌ సింగిల్స్‌‌లో పీవీ సింధు 16–21, 21–7, 12–9తో సలోని మెహతాను ఓడించి స్కోరును 2–2తో సమం చేసింది. నిర్ణయాత్మక విమెన్స్‌‌ డబుల్స్‌‌లో గాయత్రీ గోపీచంద్‌‌–ట్రిసా జోలీ 21–13, 21–12తో ఎన్జ్‌‌ సు యు–వింగ్‌‌ యంగ్‌‌పై నెగ్గి విజయాన్ని అందించారు.