ఓటమి అంచుల్లో టీమిండియా

ఓటమి అంచుల్లో టీమిండియా

ఢాకా వేదికగా జరుగుతున్న బంగ్లాదేశ్, భారత్ రెండవ టెస్ట్ లో భారత్ ఓటమి అంచున నిల్చుంది. ఈజీగా గెలవాల్సిన మ్యాచ్ లో వెన్ను చూపించింది. బంగ్లా బౌలర్ల దాటికి టాప్ క్లాస్ బ్యాట్స్ మెన్ అంతా చేతులెత్తేశారు. 

145 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన టీం ఇండియా టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ అంతా కుప్ప కూలారు. గిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (7), కేఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాహుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (2), పుజారా (6), కోహ్లీ (1) ఫెయిలయ్యారు. మెహెదీ హసన్ మిరాజ్, షకిబ్ అల్ హసన్ దాటికి మూడవ రోజు చివరి సెషన్ ముగియక ముందే భారత్ 4 వికెట్లు కోల్పోయింది. తర్వాత నైట్ వాచ్ మెన్లుగా వచ్చిన అక్షర్ పటేల్ (34), ఉనాద్కట్ (13) నాలుగవ రోజు ఆటను మొదలుపెట్టినా, వీళ్ల భాగస్వామ్యం ఎక్కువ సేపు నిలువలేకపోయింది. ఏడొవ వికెట్ లో వచ్చిన పంత్ ఆదుకుంటాడు అనుకుంటే 9 పరుగులకే వెనుదిరిగాడు. బంగ్లా బౌలర్లలో మెహెదీకి 5, షకిబ్ కి 2 వికెట్లు దక్కాయి. ప్రస్తుతం క్రీజ్ లో శ్రేయస్ అయ్యర్, రవిచంద్రన్ అశ్విన్ ఉన్నారు.