
న్యూఢిల్లీ: కరోనా, లాక్డౌన్ వల్ల ఇండియన్లు ఎన్నడూ లేనంతగా నష్టపోతారని ఇంటర్నేషనల్ మేనేజ్మెంట్ కన్సల్టింగ్ కంపెనీ ఆర్థర్ డి లిటిల్ ప్రకటించింది. దాదాపు 13.5 కోట్ల మంది జాబ్స్ కోల్పోతారని, 12 కోట్ల మంది మళ్లీ పేదరికంలోకి వెళ్లిపోతారని వెల్లడించింది. కన్జూమర్ ఆదాయం, పొదుపు విపరీతంగా తగ్గుతాయని ఈ కంపెనీ రిపోర్ట్ స్పష్టం చేసింది. తలసరి ఆదాయమూ తగ్గుతుందని కాబట్టి జీడీపీపై ఎఫెక్ట్ తప్పదని హెచ్చరించింది. ‘‘ఇండియాలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఎకానమీ రికవరీ ‘డబ్ల్యూ’ ఆకారంలో ఉండొచ్చని మేం అనుకుంటున్నాం”అని పేర్కొంది.