హైదరాబాద్, వెలుగు: ఇండియా మెడ్ ఎక్స్పో 2025 హైదరాబాద్లో శుక్రవారం మొదలైంది. డిసెంబర్ 5, 6, 7 తేదీలలో హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో కార్యక్రమం జరుగుతోంది. ఈ ఎక్స్పోలో అత్యాధునిక వైద్య పరికరాలు, డయాగ్నోస్టిక్స్, సర్జరీ సొల్యూషన్స్, హాస్పిటల్ టెక్నాలజీలను చూపించే 400కుపైగా స్టాల్స్ ఉన్నాయి.
ఈ ఏడాది ఎడిషన్ అతిపెద్దది అవుతుందని నిర్వాహకులు తెలిపారు. డాక్టర్లకు, ఆసుపత్రులకు ఆధునిక సాంకేతికతను అందుబాటులోకి తేవడానికి, వైద్య ఆవిష్కరణలను అందరికీ అందించడానికి ఇండియా మెడ్ ఎక్స్పో చాలా కీలకమని ఐఎంఏ ప్రతినిధి అన్నారు. ఆరోగ్య సంరక్షణ నిపుణులు, విద్యార్థులు సహా అందరూ ఈ ఎక్స్పోను ఉచితంగా చూడవచ్చు.
