పోస్ట్​ ఆఫీసుల్లో  12,828 పోస్టులు

పోస్ట్​ ఆఫీసుల్లో  12,828 పోస్టులు

దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్కిళ్లలోని బ్రాంచి పోస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసుల్లో గ్రామీణ డాక్ సేవక్(జీడీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) ఖాళీల భర్తీకి సంబంధించి స్పెషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సైకిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మే-2023 ప్రకటన వెలువడింది. పదో తరగతిలో సాధించిన మార్కులతో ఈ నియామకాలు చేపడతారు. ఎంపికైనవారు బ్రాంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోస్టు మాస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌(బీపీఎం), అసిస్టెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్రాంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోస్టు మాస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌(ఏబీపీఎం) హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది.  దేశ వ్యాప్తంగా మొత్తం 12,828 ఖాళీలు ఉండగా, తెలంగాణలో 96 పోస్టులు ఉన్నాయి.

అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత సాధించినవారై ఉండాలి. ఇందులో మ్యాథ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఇంగ్లీష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, స్థానిక భాష ఉండటం తప్పనిసరి. వయసు 18 నుంచి 40  ఏండ్ల మధ్యలో ఉండాలి. జీతం నెలకు బీపీఎం పోస్టులకు రూ.12,000 - రూ.29,380; ఏబీపీఎం పోస్టులకు రూ.10,000 - రూ.24,470 వేతనం ఉంటుంది.

సెలెక్షన్​: అభ్యర్థులు పదో తరగతిలో సాధించిన మా ర్కుల మెరిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రకారం నియామకాలు చేపడతారు. 

దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో జూన్​ 11 వరకు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి సమాచారం కోసం www.indiapostgdsonline.gov.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.