IND vs OMA: ఒమన్‌తో మ్యాచ్.. బుమ్రా, పాండ్యలకు రెస్ట్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!

IND vs OMA: ఒమన్‌తో మ్యాచ్.. బుమ్రా, పాండ్యలకు రెస్ట్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!

ఆసియా కప్ 2025 లో చివరి లీగ్ మ్యాచ్ ఆడేందుకు టీమిండియా సిద్ధమైంది. శుక్రవారం (సెప్టెంబర్ 19) పసికూన ఒమన్ తో తలపడనుంది. అబుదాబి వేదికగా షేక్ జాయెద్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ లో టీమిండియా క్లియర్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది. ఇండియా ఇప్పటికే సూపర్-4కు అర్హత సాధించడం.. ఒమన్ సూపర్-4 కు అర్హత సాధించలేకపోవడంతో ఈ మ్యాచ్ నామమాత్రంగా మారనుంది.  వరుసగా రెండు భారీ విజయాలతో ఆసియా కప్‌‌‌‌‌‌‌‌లో ఇప్పటికే సూపర్– 4  రౌండ్‌‌‌‌‌‌‌‌కు క్వాలిఫై అయిన టీమిండియా.. ప్రయోగాలపై దృష్టి పెట్టింది. 

బుమ్రా, హార్దిక్ లకు రెస్ట్:

ఒమన్ తో మ్యాచ్ కు టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు రెస్ట్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. బుమ్రాతో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య కూడా ఈ మ్యాచ్ కు దూరంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. సూపర్-4 కు ముందు వీరిద్దరూ ఫిట్ గా ఉండడం టీమిండియాకు చాలా కీలకం. వీరిద్దరూ తదుపరి రౌండ్ కు తాజాగా ఉండాలని జట్టు యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. బుమ్రా స్థానంలో అర్షదీప్ సింగ్ రావడం ఖాయం. ఇప్పటివరకు జరిగిన రెండు మ్యాచ్ ల్లో అర్షదీప్ కు ప్లేయింగ్ 11 లో ఆడే అవకాశం రాలేదు. హార్దిక్ పాండ్య స్థానంలో మరో ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రానా తుది జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది. 

ఈ రెండు మార్పులతో ఒమన్ తో మ్యాచ్ కు టీమిండియా బరిలోకి దిగనుంది. వికెట్ కీపర్ జితేష్ శర్మ, రింకూ సింగ్ మరోసారి బెంచ్ కే పరిమితం కావొచ్చు.  సూపర్–4లో ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌తో జరగబోయే కీలక సమరానికి ముందు తమ బ్యాటర్లకు తగినంత బ్యాటింగ్ ప్రాక్టీస్ ఇచ్చేందుకు దీన్ని ఒక గోల్డెన్ చాన్స్‌‌‌‌‌‌‌‌గా భావిస్తోంది. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో టార్గెట్లు చిన్నవి కావడంతో ఇండియా బ్యాటింగ్ ఆర్డర్‌‌‌‌‌‌‌‌కు పెద్దగా అవకాశం రాలేదు. దీంతో బ్యాటింగ్ ఆర్డర్ లో ఎలాంటి మార్పులు చేయాలనుకోవడం లేదు. 

ALSO READ : ఇవాళ (సెప్టెంబర్ 19) ఇండియా vs ఒమన్ మ్యాచ్..

సంచలనంపై ఒమన్ గురి:
   
ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించిన ఒమన్ జట్టు... ఇండియాకు ఏమాత్రం పోటీ ఇస్తుందన్నది ఆసక్తికరం. గెలుపు, ఓటములు పక్కనబెడితే ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో స్టార్లతో కూడిన టీమిండియాతో తలపడటమే ఆ టీమ్‌‌‌‌‌‌‌‌కు ఓ గొప్ప అవకాశం కానుంది. వచ్చే నెలలో జరగనున్న టీ20 వరల్డ్‌‌‌‌‌‌‌‌  కప్ క్వాలిఫయర్ టోర్నమెంట్‌‌‌‌‌‌‌‌కు ఆతిథ్యం ఇస్తున్న ఒమన్.. ఇండియా వంటి పటిష్టమైన జట్టుతో ఆడటం ద్వారా ఎంతో నేర్చుకోవాలని భావిస్తోంది. 

తుది జట్లు (అంచనా):

ఇండియా:

అభిషేక్ శర్మ, శుభ్‌‌‌‌‌‌‌‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), శివం దూబే, హర్షిత్ రానా, అక్షర్ పటేల్, అర్ష్‌‌‌‌‌‌‌‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి

ఒమన్:

జతీందర్ సింగ్ (కెప్టెన్), ఆమిర్ కలీమ్, హమ్మద్ మీర్జా, వసీం అలీ, ఆర్యన్ బిష్త్, వినాయక్ శుక్లా (వికెట్ కీపర్), జితేన్ రామానంది, షా ఫైజల్, షకీల్ అహ్మద్, హస్నైన్ షా, సమయ్ శ్రీవాస్తవ.