కివీస్‌పై విక్టరీ.. వరల్డ్ నంబర్ వన్‌గా భారత్

కివీస్‌పై విక్టరీ.. వరల్డ్ నంబర్ వన్‌గా భారత్

ముంబై: టీమిండియా టెస్టు క్రికెట్ లో మళ్లీ నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. ముంబైలోని వాంఖడేలో న్యూజిలాండ్ తో జరిగిన రెండో టెస్టులో 372 రన్స్ తేడాతో గెలవడంతో భారత్ ఈ ఘనతను సాధించింది. ఐసీసీ తాజాగా ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్ లో 124 పాయింట్లతో భారత్ తొలి స్థానం సాధించగా.. కివీస్ 121 పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయింది. యాషెస్ సిరీస్ కోసం సన్నద్ధమవుతున్న ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ లు వరుసగా 108, 107 పాయింట్లతో మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. ఇక దాయాది పాకిస్థాన్ 92 పాయింట్లతో ఐదో స్థానాన్ని దక్కించుకుంది. మరోవైపు 2021–23 ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్  టేబుల్ లో టీమిండియా మూడో స్థానంలో నిలిచింది. ఈ పట్టికలో శ్రీలంక అగ్రస్థానంలో ఉంది.