దేశంలో పెరుగుతున్న కొవిడ్ కేసులు

దేశంలో పెరుగుతున్న కొవిడ్ కేసులు

దేశంలో కరోనా  వ్యాప్తి కొనసాగుతోంది. వైరస్ చాపకింద నీరులా క్రమంగా వ్యాప్తి చెందుతోంది. కోవిడ్ కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. మాయదారి మహమ్మారి పూర్తిగా అంతం కాలేదని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. దేశంలో మరోసారి  20 వేలకు పైగా  కొత్తకేసులొచ్చాయి. గత 24 గంటల్లో కొత్తగా 20,408 పాజిటివ్ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. వైరస్ భారిన పడి 54  మంది చనిపోయారు. దేశంలో  ప్రస్తుతం  లక్షా 43 వేల 384  యాక్టివ్ కేసులున్నాయి.  

రోజువారీ పాజిటివిటీ రేట 5.05 శాతంగా ఉందని తెలిపింది. మొత్తం కేసుల్లో 0.33 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.48 శాతం ఉండగా.. మరణాలు 1.20 శాతంగా ఉన్నాయని పేర్కొంది. ఇక ఇప్పటివరకు 203.94 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని వెల్లడించింది. గడచిన 24 గంటల్లో కొత్తగా 33,87,173 మందికి వ్యాక్సిన్ అందజేశారు.