దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో లక్షా 59 వేల 632 కేసులు నమోదయ్యాయి. మరో 327 మంది మృతి చెందారు. కోవిడ్ నుంచి నిన్న ఒక్కరోజే 40వేల 863 మంది కోలుకున్నట్లు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. దేశంలో పాజిటివిటి రేటు 10.21శాతం గా ఉన్నట్లు అధికారులు తెలిపారు. యాక్టివ్ కేసులు 5 లక్షల 90 వేల 611గా ఉన్నాయి.
India reports 1,59,632 fresh COVID cases, 40,863 recoveries, and 327 deaths in the last 24 hours
— ANI (@ANI) January 9, 2022
Daily positivity rate: 10.21%
Active cases: 5,90,611
Total recoveries: 3,44,53,603
Death toll: 4,83,790
Total vaccination: 151.58 crore doses pic.twitter.com/Qmm2qQcHOS
ఇటు ఒమిక్రాన్ కేసులు కూడా భారీగా పెరుగుతున్నాయి. దేశంలో మొత్తం 3,623 ఒమిక్రాన్ కేసులు నిర్ధారణ అయ్యాయి. 27 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మహమ్మారి విస్తరించిందని వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. మహారాష్ట్రలో కొత్తవేరియంట్ విజృంభిస్తోంది. అక్కడ వెయ్యికి పైగా కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో 513 మంది ఒమిక్రాన్ బారినపడ్డారు. కర్ణాటక, రాజస్థాన్, కేరళ, గుజరాత్, తమిళనాడులో రోజురోజుకు కేసులు పెరిగుతున్నాయి.