దేశంలో కరోనా ఉధృతి.. ఒక్కరోజే 1.61 లక్షల కేసులు

దేశంలో కరోనా ఉధృతి.. ఒక్కరోజే 1.61 లక్షల కేసులు

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. 24 గంటల్లో లక్షా 61వేల 736 కేసులు నమోదవ్వగా.. 879 మంది చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య లక్షా 71వేలు దాటింది. నిన్న 97 వేల మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో మొత్తం కోటి 36 లక్షల 89వేల459 మందికి వైరస్ సోకింది. ఇందులో ఇప్పటికే కోటి 22 లక్షల 53వేల మంది కోలుకున్నారు. ప్రస్తుతం 12 లక్షలకు పైగా యాక్టివ్ కేసులున్నాయని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. మరోవైపు దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ పంపిణీ కొనసాగుతోంది. ఇప్పటివరకు 10 కోట్ల 85 లక్షల 33 వేల 85 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు.