దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. నిన్న కూడా మూడు వేలకు పైగా కేసులు రికార్డయ్యాయి. యాక్టివ్ కేసులు 20 వేలకు పైగా ఉన్నాయి. గత 24 గంటల్లో 3 లక్షల 60 వేల 613 మందికి పరీక్షలు చేయగా 3 వేల 451 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. మొత్తం కేసుల్లో 14 వందల 7 కేసులు ఢిల్లీలోనే రికార్డయ్యాయి. మహారాష్ట్రలో 253 కేసులు వచ్చాయి. నిన్న కరోనాతో 40 మంది చనిపోయారు. 3 వేల 79 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు కరోనాకు 5 లక్షల 24 వేల 64 మంది బలయ్యారు. దేశంలో రికవరీ రేట్ 98.74 శాతం ఉందని కేంద్ర వైద్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు 4 కోట్ల 25 లక్షల 57 వేల 495 మంది కోలుకున్నారని ప్రకటించింది.
మరిన్ని వార్తల కోసం