27శాతం పెరిగిన కరోనా కేసులు.. ఒక్కరోజే 3,823 కేసులు నమోదు

27శాతం పెరిగిన కరోనా కేసులు.. ఒక్కరోజే 3,823 కేసులు నమోదు

కరోనా కేసులు దేశ వ్యాప్తంగా మరోసారి ఆందోళన కలిగిస్తున్నాయి. గడిచిన 24గంటల్లో 3,823 కరోనా కేసులు నమోదయ్యాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కేసుల సంఖ్య నిన్నటితో పోలిస్తే 27శాతం పెరిగిందని వెల్లడించింది. 24 గంటల వ్యవధిలోనే ఢిల్లీ, హర్యానా, కేరళ, రాజస్థాన్‌లో ఒక్కొక్కరు చొప్పున కరోనాతో మృత్యువాత పడ్డారని తెలిపింది. ప్రస్తుతం 18,389 యాక్టివ్ కేసులు ఉన్నాయని, రికవరీ రేటు 98.77 శాతంగా నమోదైందని ఆరోగ్య శాఖ ప్రకటించింది. 

రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు 2.87 శాతం, వీక్లీ పాజిటివిటీ రేటు 2.24 శాతంగా ఉందని ఆరోగ్య శాఖ తెలిపింది. వ్యాధి నుండి కోలుకున్న వారి సంఖ్య 4,41,73,335 కు చేరిందని, మరణాల రేటు 1.19 శాతంగా నమోదైందని పేర్కొంది. మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ ప్రకారం, దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటివరకు 220.66 కోట్ల డోస్‌ల కొవిడ్ 19 వ్యాక్సిన్‌లను అందించారు.