కెనడియన్లకు మళ్లీ ఈ-వీసా సేవలు

కెనడియన్లకు మళ్లీ ఈ-వీసా సేవలు

న్యూఢిల్లీ: కెనడియన్లకు ఎలక్ట్రానిక్ వీసా (ఈ- వీసా) సేవలను భారత్ పునరుద్ధరించినట్లు సంబంధిత వర్గాలు బుధవారం వెల్లడించాయి. ఈ నిర్ణయం తో  కెనడా పౌరులకు అన్ని రకాల వీసా సర్వీసులను అందుబాటులోకి తెచ్చినట్లయింది. ఖలిస్తానీ టెర్రరిస్ట్ హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య విషయంలో భారత్, కెనడా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా యి.

దాంతో సెప్టెంబర్ 21 నుంచి కెనడియన్లకు వీసా సర్వీసులను నిలిపేస్తున్నట్లు భారత్ ప్రకటించింది. పలు అంశాలను సమీక్షించిన అనంతరం అక్టోబర్ లో ఎంట్రీ, బిజినెస్, మెడికల్, కాన్ఫరెన్స్ కేటగిరీల్లో వీసాలను పునరుద్ధరించారు. దాదాపు రెండు నెలల తర్వాత తాజాగా ఈ- వీసాలను కూడా మళ్లీ అందుబాటులోకి తెచ్చారు.