ఆసియాలో  పతకాల పంట

ఆసియాలో  పతకాల పంట

వుంగ్ టౌ (వియత్నాం): అండర్‌‌–23 ఆసియా చాంపియన్‌‌షిప్‌‌లో ఇండియా రెజ్లర్లు పతకాల పంట పండించారు. విమెన్స్‌‌ కేటగిరీలో ఫైనల్‌‌ చేరిన పది విభాగాల్లోనూ మెడల్స్‌‌ సాధించారు. మొత్తం నాలుగు గోల్డ్స్‌‌, ఐదు సిల్వర్, ఒక బ్రాంజ్‌‌ మెడల్‌‌తో కలిపి టీమ్‌‌ టైటిల్‌‌ను కైవసం చేసుకున్నారు. ప్రియాన్షి ప్రజాపతి (50 కేజీ), రీనా (55 కేజీ), శ్రుష్టి (68 కేజీ), ప్రియా (76 కేజీ) టాప్ ప్లేస్‌‌లను సాధించారు

. నేహా శర్మ (57 కేజీ), తన్వీ (59 కేజీ), ప్రగతి (62 కేజీ), సిక్షా (65 కేజీ), జ్యోతి బెర్వాల్‌‌ (72 కేజీ) సిల్వర్‌‌ మెడల్స్‌‌ను సాధించారు. హినాబెన్‌‌ ఖలీఫా (53 కేజీ) మాత్రం బ్రాంజ్‌‌ మెడల్‌‌తో సరిపెట్టుకుంది. గ్రీకో రోమన్‌‌ స్టైల్‌‌లో సుమిత్‌‌ (63 కేజీ) గోల్డ్‌‌ మెడల్‌‌ నెగ్గగా, అంకిత్‌‌ గులియా (72 కేజీ), నితీశ్‌‌ (97 కేజీ) బ్రాంజ్‌‌ మెడల్స్‌‌ సొంతం చేసుకున్నారు. మెన్స్‌‌ ఫ్రీ స్టయిల్‌‌లో వికీ (97 కేజీ) బంగారు పతకం సాధించాడు.