
అంట్వెర్ప్ (బెల్జియం): ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్ యూరోపియన్ అంచెలో ఇండియా హాకీ జట్టు వరుసగా ఆరో ఓటమిని మూటగట్టుకుంది. ఆదివారం జరిగిన మ్యాచ్లో ఇండియా 2–3తో ఆస్ట్రేలియా చేతిలో ఓడింది. సంజయ్ (3వ ని), దిల్ప్రీత్ సింగ్ (36వ ని) ఇండియాకు గోల్స్ అందించగా, ఆసీస్ తరఫున టిమ్ బ్రాండ్ (4వ ని), బ్లాకీ గోవెర్స్ (5వ ని), కూపర్ బర్న్స్ (18వ ని) గోల్స్ చేశారు. ఆరంభంలో మెరుగ్గా ఆడిన ఇండియా బంతిపై పట్టు సాధించే ప్రయత్నం చేసింది.
ఈ క్రమంలో నాలుగో నిమిషంలోనే గోల్ కొట్టినా చివర్లో ఆసీస్ ఎదురుదాడిని అధిగమించలేకపోయింది. ఈ నెల 21న జరిగే తర్వాతి మ్యాచ్లో ఇండియా.. బెల్జియంతో తలపడుతుంది. ఇక విమెన్స్ జట్టు కూడా 1–2తో ఆసీస్ చేతిలోనే కంగుతిన్నది. ఇండియాకు ఇది వరుసగా రెండో పరాజయం. వైష్ణవి పాల్కే (3వ ని) ఇండియాకు ఏకైక గోల్ అందించగా, అమీ లాటన్ (37వ ని), లెక్సీ పికెరింగ్ (60వ ని) ఆసీస్ తరఫున గోల్స్ చేశారు. మంగళవారం జరిగే మ్యాచ్లో ఇండియా.. అర్జెంటీనాతో తలపడుతుంది.