కరోనా టెస్టుల్లో రికార్డు.. 24 గంటల్లో 4.20 లక్షల శాంపిల్స్‌ సేకరణ

కరోనా టెస్టుల్లో రికార్డు.. 24 గంటల్లో 4.20 లక్షల శాంపిల్స్‌ సేకరణ

న్యూఢిల్లీ: కరోనా టెస్టుల సంఖ్యలో దేశం భారీ వృద్ధిని నమోదు చేసింది. శనివారం దేశవ్యాప్తంగా 4.20 లక్షల శాంపిల్స్‌ను తీసుకున్నారు. ఇప్పటివరకు 24 గంటల వ్యవధిలో చేసిన కరోనా టెస్టుల్లో ఇదే అత్యధికం అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం తెలుస్తోంది. శుక్రవారం నుంచి గత 24 గంటట్లో 4,20,898 శాంపిళ్లను సేకరించారు. టెస్ట్స్‌ పర్ మిలియన్ (టీపీఎం) 11,485కు.. టెస్టింగ్ కెపాసిటీ 1,58,49,068కి పెరిగింది. దేశంలో కరోనా కేసుల సంఖ్య 13 లక్షల మార్కు దాటిన సంగతి తెలిసిందే. దేశంలో చాలా చోట్ల కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ మొదలవడంతో కేసుల సంఖ్య మరింత పెరుగుతుందని భయాందోళనలు నెలకొన్నాయి.