శత్రుదుర్భేద్యం ఎస్ 500..త్వరలో రష్యాతో భారత్ ఒప్పందం

శత్రుదుర్భేద్యం ఎస్ 500..త్వరలో రష్యాతో భారత్ ఒప్పందం

న్యూఢిల్లీ: పహల్గాం టెర్రర్  అటాక్​కు ప్రతీకారంగా భారత బలగాలు చేసిన ‘ఆపరేషన్  సిందూర్’ లో ఎస్ 400 ఎయిర్ డిఫెన్స్  మిసైల్  సిస్టమ్  కీలకపాత్ర పోషించింది. 2018లో రష్యాతో ఒప్పందం చేసుకుని ఈ మిసైల్ సిస్టమ్​ను  భారత్  దిగుమతి చేసుకుంది. ఆపరేషన్  సిందూర్​లో ఎస్ 400 వందల కిలోమీటర్ల దూరంలో శత్రుదేశ ఎయిర్ క్రాఫ్ట్​లను అత్యంత కచ్చితంగా ట్రేస్ చేసి కూల్చిపారేసింది. పాక్  మిసైళ్లు మన దేశంలోకి రాకుండా విజయవంతంగా అడ్డుకుంది. ఇప్పుడు ఎస్ 400కు అప్ గ్రేడెడ్  వెర్షన్​గా ఎస్ 500ను రష్యా నుంచి భారత్ దిగుమతి చేసుకోనుంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్  పుతిన్  ఈ నెల 4, 5న భారత్ లో పర్యటించనున్న నేపథ్యంలో ఎస్ 500 కొనుగోలు చేయడానికి రష్యాతో భారత్  ఒప్పందం 
కుదుర్చుకోనుంది. దీంతో మన దేశ ఎయిర్ డిఫెన్స్  మరింత బలోపేతం కానుంది.