
ఇస్లామిక్ ఉగ్రవాదంపై భారత్, అమెరికా ఉమ్మడి పోరాటం చేస్తున్నాయని చెప్పారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. రెండ్రోజుల పర్యటనకు తొలిసారి భారత్ వచ్చిన ఆయన గుజరాత్లోని అహ్మదాబాద్ మోతెరా స్టేడియంలో ‘నమస్తే ట్రంప్’ సభలో ప్రసంగించారు. ప్రజలను టెర్రరిజం ముప్పు నుంచి కాపాడుకోవడానికి రెండు దేశాలు కృషి చేస్తున్నాయన్నారాయన. ఐసిస్ ఉగ్రసంస్థ అరాచకాలను అంతమొందించడానికి తన పాలనలో అమెరికా మిలటరీకి పూర్తి పవర్స్ ఇచ్చినట్లు చెప్పారు. ఆగ్నేయాసియాలో రక్తపాతం సృష్టిస్తున్న ఆ టెర్రర్ గ్రూప్ ఈ రోజు దాదాపు 100 శాతం నాశనమైందని, దాని చీఫ్ అల్ బగ్దాదీని హతమార్చామని తెలిపారు ట్రంప్.
భారత్కు తిరుగులేని రక్షణ సహకారం కొనసాగుతుందని చెప్పారు ట్రంప్. భూమిపై అత్యంత శక్తిమంతమైన, బెస్ట్ మిలటరీకి ఎక్యూప్మెంట్ అందిస్తున్నామన్నారు. తమ వద్ద ఉన్న పవర్ఫుల్ ఆయుధాలను భారత్కు విక్రయించేందుకు రేపు డీల్పై సంతకం చేయనున్నట్లు చెప్పారు. భారత్తో 21.5 వేల కోట్ల రూపాయల డిఫెన్స్ డీల్ చేసుకోబోతున్న విషయం ప్రకటించడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు ట్రంప్.