ఢిల్లీలో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతోన్న రెండో టెస్టులో మొదటి రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్ లో వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 13, కేఎల్ రాహుల్ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు.
అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 263 పరుగులకు ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్ల స్పిన్ దాటికి ఆస్ట్రేలియా తక్కువ స్కోరుకే పరిమితమయ్యింది. ఖవాజా 81, హ్యాండ్స్ కాంబ్ 72,ప్యాట్ కమిన్స్ 33 పరుగులు మినహా మిగతావారెవరూ పెద్దగా రాణించలేదు. దీంతో ఆస్ట్రేలియా 78.4 ఓవర్లలో 263 పరుగులకు ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్లలో షమి 4, అశ్విన్ 3, రవీంద్ర జడేజా 3 వికెట్లు తీశారు.