పుజారా సెంచరీ మిస్.. తొలి రోజు భారత్ స్కోర్ 278/6

పుజారా సెంచరీ మిస్.. తొలి రోజు భారత్ స్కోర్ 278/6

భారత్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న ఫస్ట్ టెస్టు తొలిరోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్లు నష్టపోయి 278 పరుగులు సాధించింది. ఆరంభంలోనే  వికెట్లను కోల్పోయిన భారత్ .. తర్వాత పుంజుకుంది. శతకానికి చేరువగా వచ్చిన పుజారా 90 పరుగుల దగ్గర ఔటయ్యాడు. 90వ ఓవర్  చివరి బంతికి అక్షర్ పటేల్ కూడా ఔట్ అయ్యాడు. దీంతో తొలి రోజు ఆట ముగిసేసరికి టీమిండియా 6 వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ 82 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్  బౌలర్లలో తైజుల్ ఇస్లామ్ 3, మెహిదీ 2, ఖలిద్  అహ్మద్ ఒక వికెట్  తీశారు.

పుజారా నాలుగేళ్ల నిరీక్షణ తెరపడేదెన్నడు

దాదాపు నాలుగేళ్ల తర్వాత సెంచరీ చేసే అవకాశం వస్తే దానిని  పుజారా వృథా చేసుకొన్నాడు. సెంచరీకి 10 పరుగుల దూరంలో  పుజారా (203 బంతుల్లో90) ఔటయ్యాడు. తైజుల్‌ ఇస్లామ్‌ బౌలింగ్ లో పుజారా క్లీన్‌బౌల్డయ్యాడు.  2019లో  ఆసీస్‌ పర్యటనలో పుజారా చివరిసారి టెస్టుల్లో సెంచరీ చేశాడు.