
బంగ్లాతో జరుగుతోన్న రెండో టెస్టులో మొదటి రోజు ఆట ముగిసింది. వెలుతురు లేమి కారణంగా మ్యాచ్ను కుదించారు. దీంతో ఆట ముగిసే సమయానికి భారత్ వికెట్ నష్టపోకుండా 19 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్ 3, శుభ్ మన్ గిల్ 14 ఉన్నారు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో భారత్ ఇంకా 218 పరుగుల వెనుకంజలో ఉంది.
అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 227 పరుగులకే ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్లు ఉమేశ్ యాదవ్, రవిచంద్ర అశ్విన్ విజృంభించడంతో బంగ్లాదేశ్ ను 227 పరుగులకే కట్టడి చేశారు. బంగ్లా బ్యాట్స్ మెన్ లలో మోమినుల్ హక్ ఒక్కడే 84 పరుగులు చేశాడు. మిగతా వారెవరూ పెద్దగా రాణించలేదు. భారత బౌలర్లలో ఉమేశ్ యాదవ్ 4,అశ్విన్ 4, జయదేవ్ ఉనద్కత్ 2 వికెట్లు తీశారు. ఇప్పటికే సిరీస్ 1, 0 తేడాతో టీమిండియా ఆధిక్యంలో ఉంది. ఈ టెస్టు గెలిచి సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయాలని చూస్తోంది.