
బంగ్లాదేశ్ తో జరుగుతోన్న రెండో టెస్టులో భారత బౌలర్లు విజృంభించారు. తొలి రోజు బంగ్లాదేశ్ ను 227 పరుగులకే ఆలౌట్ చేశారు. భారత బౌలర్లు ఉమేశ్ యాదవ్, రవిచంద్ర అశ్విన్ విజృంభించడంతో బంగ్లాదేశ్ ను 227 పరుగులకే కట్టడి చేశారు.
ఇవాళ టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన బంగ్లా బ్యాట్స్ మెన్ లలో మోమినుల్ హక్ ఒక్కడే 84 పరుగులు చేశాడు. మిగతా వారెవరూ పెద్దగా రాణించలేదు. భారత బౌలర్లలో ఉమేశ్ యాదవ్ 4,అశ్విన్ 4, జయదేవ్ ఉనద్కత్ 2 వికెట్లు తీశారు. ఇప్పటికే సిరీస్ 1-0 తేడాతో టీమిండియా ఆధిక్యంలో ఉంది. ఈ టెస్టు గెలిచి సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయాలని చూస్తోంది.