న్యూజిలాండ్ పై వన్డే సరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా ఇప్పుడు టీ20 సిరీస్ పై కన్నేసింది. రేపటి నుంచి న్యూజిలాండ్ తో మూడు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. మొదటి టీ20 రాంచీలో జరగనుంది. అయితే ఈ టీ20లకు రోహిత్, కోహ్లీ దూరంగా ఉండటంతో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో టీమిండియా రంగంలోకి దిగుతోంది. యంగ్ ప్లేయర్లు, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, శుభ్ మన్ గిల్, హార్ధిక్ పాండ్యా మంచి ఫామ్ లో ఉన్నారు. వీరి బ్యాటింగ్ కు తోడు ఉమ్రాన్ మాలిక్ కుల్దీప్ యాదవ్, అర్ష్ దీప్ సింగ్ బౌలింగ్ లో రాణిస్తే మ్యాచ్ గెలవడం ఈజీనే. వన్డేల్లో కొనసాగించిన జోరునే టీ20ల్లోనూ కొనసాగిస్తుందా? లేదా అన్నది చూడాలి.
మరో వైపు న్యూజిలాండ్ తో జరగబోయే టీ20 సిరీస్ కు యంగ్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ మణికట్టుకు గాయం కారణంగా సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. దీంతో పృథ్వీ షా, రాహుల్ త్రిపాఠీలతో పాటు మరికొందరిని బీసీసీఐ రాంచీకి తీసుకెళ్లింది.
భారత జట్టు: ఇషాన్ కిషన్ (WK), హార్దిక్ పాండ్యా (c), శుభ్మన్ గిల్, రాహుల్ త్రిపాఠి, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, శివం మావి, అర్ష్దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, జితేష్ శర్మ, ముఖేష్ కుమార్, పృథ్వీషా
న్యూజిలాండ్ జట్టు: డెవాన్ కాన్వే (wk), మిచెల్ సాంట్నర్ (c), ఫిన్ అలెన్, మార్క్ చాప్మన్, గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, మైఖేల్ బ్రేస్వెల్, లాకీ ఫెర్గూసన్, ఇష్ సోధి, బ్లెయిర్ టిక్నర్, జాకబ్ డఫీ, మైఖేల్ షివర్పన్, డానీ సివెర్పాన్, బెన్ లిస్టర్