చెలరేగిన షమీ...భారత్ పై న్యూజిలాండ్ స్వల్ప ఆధిక్యం

చెలరేగిన షమీ...భారత్ పై న్యూజిలాండ్ స్వల్ప ఆధిక్యం

WTC ఫైనల్ మ్యాచ్ ఐదో రోజు న్యూజిలాండ్ తన తొలి ఇన్నింగ్స్ లో 249 పరుగులకు ఆలౌట్ అయ్యింది. భారత్ బౌలర్లు షమీ,ఇషాంత్ శర్మ చెలరేగారు. షమీ నాలుగు వికెట్లు, ఇషాంత్ శర్మ మూడు, రవిచంద్ర అశ్విన్ 2, జడేజ ఒక వికెట్ తీయడంతో న్యూజిలాండ్ తక్కువ స్కోరు చేయగల్గింది. అంతకుముందు ఇండియా  తొలి ఇన్సింగ్స్ లో 217 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో న్యూజిలాండ్ కు తొలి ఇన్నింగ్స్ లో 32 పరుగుల ఆధిక్యం లభించింది.